చందానగర్, వెలుగు: భారీ అగ్ని ప్రమాదం జరిగి భవన నిర్మాణ కూలీలు నివాసం ఉండే 30 గుడిసెలు కాలిబూడిదయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ నాగేశ్వర్రావు తెలిసిన వివరాల ప్రకారం.. చందానగర్లోని జవహర్నగర్కాలనీలో ఎస్ వీఎస్యాంపిల్ హోమ్స్అపార్ట్మెంట్ నిర్మిస్తున్న కార్మికులు దాని పక్కనే గుడిసెలు వేసుకున్నారు.
సోమవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఆ గుడిసెలకు అంటుకున్నాయి. ఆ సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పటాన్చెరు ఫైర్స్టేషన్ సిబ్బంది ఫైర్ఇంజిన్తో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు డీఎఫ్వో నాగేశ్వర్రావు తెలిపారు. కూలీలకు చెందిన సామగ్రి మంటల్లో కాలిపోయినట్లు పేర్కొన్నారు.
