రాష్ట్రంలో మ‌ళ్లీ భారీగా పెరిగిన కేసులు..11 మంది మృతి

రాష్ట్రంలో మ‌ళ్లీ భారీగా పెరిగిన కేసులు..11 మంది మృతి

హైద‌రాబాద్: రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా 2,384 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ‌. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌1,04,249కి చేర‌గా అందులో యాక్టివ్ కేసుల సంఖ్య‌22,908 ఉండ‌గా..80,585 మంది గ‌త 24 గంట‌ల్లో1,851 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 11 మంది మ‌ర‌ణించ‌గా..మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 755కి చేరిందని తెలిపింది వైద్యారోగ్య‌శాఖ‌.