వైన్ షాప్లో చోరీ.. రూ. 2.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు

వైన్ షాప్లో చోరీ.. రూ. 2.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలోని శ్రీ మహాలక్ష్మీ వైన్ షాప్ లో అర్థరాత్రి చోరీ జరిగింది. వైన్ షాప్ స్వెటర్ తాళాలు పగలగొట్టి షాపులో ఉన్న రూ. 2.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వైన్స్ షాపు నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.