సెంట్రల్ విస్టా నిర్మాణం అంత ముఖ్యమా?

సెంట్రల్ విస్టా నిర్మాణం అంత ముఖ్యమా?

న్యూఢిల్లీ: కరోనాతో దేశం అల్లాడుతున్న ఈ సమయంలో సెంట్రల్ విస్టా భవనం నిర్మించడం అవసరమా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. విపత్తు టైమ్ లో వేలాది కోట్ల ప్రజా ధనంతో కడుతున్న సెంట్రల్ విస్టా పనులను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ తక్కువ ప్రభుత్వ జోక్యంతో ఎక్కువ పాలనను అందిస్తామని చెప్పారని.. కానీ అధిక అహంభావంతో, తక్కువ జాలితో పాలనను సాగిస్తున్నారని ట్వీట్ చేశారు. కనిపించని శత్రువుతో యుధ్దం చేస్తున్నామని మోడీ అనడం పైనా జైరాం కామెంట్ చేశారు. శత్రువు కనిపించడం లేదేమో గానీ మోడీ ప్రభుత్వ వైఫల్యాలు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని విమర్శించారు.