స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మే 20న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కేపీహెచ్బీలోని కైకలాపూర్ మైదానంలో భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేయనున్నారు నందమూరి అభిమానులు. ఇందులో భాగంగా ఈరోజు ( మే16) కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో సభ జరిగే ప్రాంతంలో భూమి పూజ చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, నందమూరి రామకృష్ణ. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రతో కూడిన పుస్త ఆవిష్కరణ తో పాటు యాప్, వెబ్ సైట్ ను ప్రారంభించనున్నారు.
నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి వెళ్లిన టీడీ జనార్దన్, నందమూరి రామకృష్ణ వెళ్లి ఆహ్వానపత్రికను అందజేశారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారకరామారావుని స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని వెల్లడించారు.