ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు మయాంక్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ దూరం

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు మయాంక్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ దూరం

న్యూఢిల్లీ: ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌‌‌‌‌లో వెనకబడిన లక్నో సూపర్‌‌‌‌‌‌‌‌జెయింట్స్‌‌‌‌‌‌‌‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యంగ్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ మయాంక్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ మిగతా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు అందుబాటులో ఉండటం లేదు. మయాంక్‌‌‌‌‌‌‌‌ గ్రేడ్‌‌‌‌‌‌‌‌–1 టియర్‌‌‌‌‌‌‌‌ ఇంజ్యురీతో బాధపడుతున్నాడని కోచ్‌‌‌‌‌‌‌‌ జస్టిన్‌‌‌‌‌‌‌‌ లాంగర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. ‘మయాంక్‌‌‌‌‌‌‌‌ కాలిపిక్క కండరం చీరుకుపోయింది. గ్రేడ్‌‌‌‌‌‌‌‌–1 టియర్‌‌‌‌‌‌‌‌గా భావిస్తున్నాం.

ఇది నయం కావడానికి టైమ్‌‌‌‌‌‌‌‌ పడుతుంది. ప్రస్తుతానికి లీగ్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు అందుబాటులో ఉండడు. ఒకవేళ లక్నో ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధిస్తే అప్పుడు రీ ఎంట్రీ గురించి ఆలోచిస్తాం. నాకౌట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తాం’ అని లాంగర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. మరోవైపు మయాంక్‌‌‌‌‌‌‌‌కు బీసీసీఐ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక సీఎస్కే పేసర్‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌ కూడా మిగతా మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడటం అనుమానంగానే ఉంది. దీపక్‌‌‌‌‌‌‌‌ గాయం ఇంకా తగ్గలేదని సీఈవో కాశీ విశ్వనాథన్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు.