విద్య, వైద్యం పేరుతో మల్లారెడ్డి కుటుంబం కోట్లు దోచుకుంటుంది: మైనంపల్లి రోహిత్

విద్య, వైద్యం పేరుతో  మల్లారెడ్డి కుటుంబం కోట్లు దోచుకుంటుంది: మైనంపల్లి రోహిత్

మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం విద్య, వైద్యం, రాజకీయం పేరుతో కోట్ల రూపాయలు దండుకంటున్నారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి ఇకపై నీ ఆటలు అక్రమాలు సాగవని.. మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. కుత్బుల్లాపూర్ దూలపల్లిలోని మైనంపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకుని.. దాచుకున్న ప్రతి పైసా బయటకు వస్తుందన్నారు మైనంపల్లి రోహిత్. గత కొద్దిరోజులుగా మెదక్ నియోజక వర్గానికి చెందిన విద్యార్థులు వారి బాధను తనతో చెప్పుకుంటున్నారని.. అవగాహన లేని వారు కళాశాల నడుపుకుంటూ విద్యార్థులను, వారి తల్లి తండ్రులను హింస పెడుతున్నారని అన్నారు మైనంపల్లి రోహిత్.