‘దిశ’ కు ఇది నిజమైన నివాళి: మెగాస్టార్ చిరంజీవి

‘దిశ’ కు ఇది నిజమైన నివాళి: మెగాస్టార్ చిరంజీవి

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పోలీసు కాల్పుల్లో నిందితులు మృతిచెందారన్న వార్త తెలుసుకొని బాధితురాలికి సరైన న్యాయం జరిగిందని భావించానన్నారు. నేరస్థులకు శిక్ష వేసిన సీఎం కేసీఆర్, సజ్జనార్ కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

“నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణం గా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు” అన్నారు మెగాస్టార్ చిరంజీవి.