మహేష్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మహేష్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబును కలిసి పరామర్శించారు. బుధవారం కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ క్రమంలో ఇందిరాదేవి మరణ వార్తపై చిరు స్పందించారు. ఇందిరా దేవి మృతి తనను ఎంతో కలచివేసిందని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. కృష్ణ, మహేష్, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

అయితే నిన్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల కృష్ణ–మహేష్ లను చిరు కలవలేకపోయారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన మహేష్ కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించారు. కృష్ణ, మహేష్ ను పరామర్శించిన చిరంజీవి.. ఇందిరా దేవికి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది.

బుధవారం తెల్లవారు జామున కన్నుమూసిన ఇందిరా దేవి అంత్యక్రియలను మహేష్ బాబు దగ్గరుండి జరిపించారు. కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్ధం ఆమె పార్దివ దేహాన్ని పద్మాలయా స్టూడియోలో మధ్యాహ్నం వరకు ఉంచారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.