ప్రగతిభవన్లో కేసీఆర్తో మేఘాలయ సీఎం భేటీ

ప్రగతిభవన్లో కేసీఆర్తో మేఘాలయ సీఎం భేటీ

హైద‌రాబాద్ : ప్రగ‌తి భ‌వ‌న్‌లో గురువారం (సెప్టెంబర్ 7న) ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తేనీటి విందు ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరువురు ముఖ్యమంత్రులు ఇష్టాగోష్ఠి నిర్వహించారు.

సీఎం సంగ్మాను శాలువాతో సీఎం కేసీఆర్ సత్కరించి, మెమొంటో బహుకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ సీఎంకు కేసీఆర్ వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, బీఆర్ఎస్ నేతలు వేణుగోపాల చారి, దాసోజు శ్రవణ్, కె వంశీధర్ రావు ఉన్నారు.