మహబూబ్ నగర్ లో బీజేపీదే గెలుపు : అందె బాబయ్య 

మహబూబ్ నగర్ లో బీజేపీదే గెలుపు : అందె బాబయ్య 

షాద్ నగర్,వెలుగు: ముఖ్యమంతి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై చేసిన వ్యాఖ్యలు  సమంజసం కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య అన్నారు. సోమవారం షాద్ నగర్ టౌన్ లో నిర్వహించిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీకే అరుణకు  ప్రజల నుంచి వస్తున్న ఆదరణను సీఎం రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు. మహబూబ్ నగర్ లో బీజేపీ విజయం ఖాయం అయిందనే సమాచారంతో ముఖ్యమంత్రి విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు.  సీఎం సొంత జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లో ఓటమి  తప్పదన్నారు.