
ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో ఓ ఖైది ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫిరోజ్ ఖాన్ అనే ఖైదీ తన తల్లిని చంపి జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అయితే అతని మానసిక స్థితి బాగాలేదని పోలీసులు ఫిరోజ్ ఖాన్ ను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో చేర్చారు. అయితే ఆదివారం ఫిరోజ్ ఖాన్ హాస్పిటల్ లోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఉండటం గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.