బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఫలితంగా ఒక మహిళ ఆమె రెండున్నరేళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నాగవర ప్రాంతంలో చోటుచేసుకుంది. కల్యాణ్ నగర్ నుంచి హెచ్ఆర్బీఆర్ లేఅవుట్కు వెళ్లే రోడ్డులో ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న మెట్రో రైలు పిల్లర్ కూలిపోయింది. ఈ సమయంలో రోడ్డుపై బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి, అతని భార్య, వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆల్టిస్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే తల్లి, కుమారుడు మృతి చెందారు. మృతులు 25 ఏళ్ల తేజస్వి, ఆమె కుమారుడు రెండున్నరేళ్ల విహాన్గా పోలీసులు గుర్తించారు.
తమ కొడుకుతో కలిసి దంపతులు హెబ్బాల్ వైపు వెళ్తుండా మెట్రో పిల్లర్ ఓవర్లోడ్తో బైక్పై కూలిందని డీసీపీ భీమాశంకర్ ఎస్ గులేద్ తెలిపారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయని, తల్లీ, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.