తమిళనాడు మాజీ సీఎం లు ఎంజీ రామచంద్రన్, జయలలితల దేవాలయాన్ని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఇవాళ(శనివారం) ప్రారంభించారు. మధురైలోని పట్టిలో విశాలమైన స్థలంలో రూ. 50లక్షల ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయంలో ఎజీఆర్, జయలలితల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు.
జయలలిత కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఉదయ్కుమార్ ఈ ఆలయాన్ని నిర్మించారు.