పెండింగ్ బిల్లు ఇవ్వకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం : నల్లవెల్లి కురుమూర్తి

పెండింగ్ బిల్లు ఇవ్వకపోతే  కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం : నల్లవెల్లి కురుమూర్తి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి హెచ్చరించారు. గురువారం సీఐటీయూ జిల్లా ఆఫీసులో మధ్యాహ్న భోజన వంట నిర్వాహకుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆరు నెలలుగా కూరగాయల, గుడ్ల బిల్లులు రాకపోవడం వంట నిర్వాహకులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  

ప్రస్తుత ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిద్దమ్మ, అరుణ, నాయకులు కుర్వీద్ బేగం పాల్గొన్నారు.