హైదరాబాద్ లో ‘మిలీ’ మూవీ ప్రమోషన్స్

హైదరాబాద్ లో ‘మిలీ’ మూవీ ప్రమోషన్స్

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘మిలీ’ నవంబర్ 4న రిలీజ్ అవుతోంది. మలయాళం మూవీ హెలెన్ కి ఇది రీమేక్. మతు కుట్టి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిర్మాత బోనీ కపూర్,  నటి జాన్వీ కపూర్,  సన్నీ కౌశల్ లు హైదరాబాద్ కు వచ్చారు.  

‘‘సౌత్ సినిమాలలో యాక్ట్ చేయడం నా డ్రీమ్.. అవకాశం వస్తే నటిస్తా. అయితే సౌత్ లో ఇంకా ఏ సినిమాకి సైన్ చేయలేదు. హైదరాబాద్ బిర్యానీ, పెసరట్టు అంటే నాకు చాలా ఇష్టం. మిలీ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. 22 రోజులపాటు కోల్డ్ స్టోరేజ్ లో షూట్ చేశాం. ఫ్రీజర్ లో షూట్ చేయడం చాలా టఫ్ గా ఉంటుందని నాకు ముందే తెలీదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. కామెడీ సినిమాలు, ప్రాపర్ లవ్ స్టొరీ చేయాలని ఉంది’’ అని జాన్వీ కపూర్ గతంలో పలుమార్లు చెప్పారు. 

హైదరాబాద్ తో తమ ఫ్యామిలీకి విడదీయరాని బంధం ఉందని నిర్మాత బోనీ కపూర్ వ్యాఖ్యానించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడకు చాలా సార్లు వచ్చినట్లు, వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ మారుతూనే ఉందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొందామని అనుకున్నా కుదరలేదన్నారు. తెలుగు ప్రజలు శ్రీదేవిని ఎంతగానో ఆదరించారని, అలాగే జాన్వీని ఆదరిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. మిలీ సినిమా కోసం జాన్వీ కి ఇంతకు ముందు తాను తీసుకున్న రెమ్యునరేషన్ కంటే చాలా ఎక్కువగా పే చేసినట్లు వెల్లడించారు.