హైదరాబాద్‌‌ను యూటీగా మార్చేందుకు మోడీ కుట్ర

హైదరాబాద్‌‌ను యూటీగా మార్చేందుకు మోడీ కుట్ర

న్యూఢిల్లీ: భవిష్యత్‌‌లో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నుతోందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఓవైసీ ఫైర్ అయ్యారు. జమ్ము-కశ్మీర్ రీ-ఆర్గనైజేషన్ అమెండమెంట్ బిల్లుపై శనివారం లోక్ సభలో ఓవైసీ మాట్లాడారు. బీజేపీ పాలనలో కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన వాటిలో కశ్మీర్ మొదటిదన్న ఓవైసీ.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకూ ఇదే గతి పడుతుందన్నారు. కశ్మీర్‌‌లో ముస్లింలు మెజార్టీగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగాల పరంగా వారికి పెద్దగా అవకాశాలు రావట్లేదని చెప్పారు.