ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడు : సీపీఐ నారాయణ

ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడు : సీపీఐ నారాయణ

ప్రధాని మోదీపై విమర్శలు చేశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడని విమర్శించారు. నరేంద్ర మోడీకి వివాహ వ్యవస్థపై గౌరవం లేదని అన్నారు.  తాళి కట్టిన భార్యను వదిలేసినోడు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మోడీ చెప్పేవన్నీ అబద్దాలే. అతడిని మించిన అబద్దాలకోరు మరొకరులేరని ఫైర్ అయ్యారు. అబద్దాలకోరు మోదీని, బీజేపీని ఇంటికి సాగనంపాలని అన్నారు.

మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీని ఓడించాలని కోరారు. హిందువులు,మైనార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపి నేతలు  కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా దళితులు,  మైనార్టీలు, మేధావులపై దాడులు, హత్యలు జరిగాయని అన్నారు. అనేకమంది మేధావులను నిర్బంధించి బీజేపీ ప్రభుత్వం  జైల్లో పెట్టించిందని విమర్శించారు.

ప్రజలకు అందుబాటులో ఉండకుండా, అభివృద్ధి పనులు చేపట్టని బండి సంజయ్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. కరీంనగర్ ను అభివృద్ధి చేయని బండి సంజయ్ ను  ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావును,  ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు.