యువత ధర్మ రక్షణ కోసం పాటుపడాలి : మంత్రి ఎర్రబెల్లి

యువత ధర్మ రక్షణ కోసం పాటుపడాలి : మంత్రి ఎర్రబెల్లి

యువత ధర్మ రక్షణ కోసం పాటు పడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన, హిందూ వాహిని అధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. 

మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ అని మంత్రి కొనియాడారు. శివాజీ మహరాజ్ చరిత్ర స్ఫూర్తిదాయకమని..స్త్రీని గౌరవించి, హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన వీరుడని ఆయన చెప్పారు. తల్లులు పిల్లలకు బాల్యం నుండే శివాజీ మహరాజ్ ఆశయాలను బోధించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా.. చత్రపతి స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు. యువత ధర్మాన్ని రక్షించాలని ఆయన సూచించారు.