బీజేపీ నేతల తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతున్ని చేసుంటయ్: హరీశ్

బీజేపీ నేతల తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతున్ని చేసుంటయ్: హరీశ్

ప్రధాని మోడీకి మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.  ప్రత్యర్థుల  తిట్లను కిలోల  లెక్క బేరిజు  వేస్తూ ...అవే తన బలమంటున్న మోడీ.. ఈ లెక్కన  తెలంగాణ బీజేపీ నేతల  టన్నుల  కొద్ది  తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతుడిని  చేసుంటాయని అన్నారు.  దేశానికి, తెలంగాణకు ఏం చేశావని తాము  ప్రశ్నిస్తే.. తిట్ల పేరుతో మోడీ తప్పించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తాను రోజుకు రెండు, మూడు కిలోలు తిట్లు తింటూన్నానని నిన్న జరిగిన సభలో మోడీ అన్నారు. ప్రతిపక్షాలు తిట్టే తిట్లే తనకు బలంగా మారుతున్నాయని  అన్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నాకు దేవుడు ఓ వరమిచ్చాడు!: మోడీ

కొందరు నిరాశ, అత్యాశ, భయంతో పొద్దూమాపు నన్ను తిడుతూనే ఉంటారు. వాళ్ల డిక్షనరీ అంతా మోడీని తిట్టడమే  ఉంటుంది. ఇవి నాకు కొత్త కాదు. 20, 22 ఏండ్ల నుంచి వెరైటీ వెరైటీ తిట్లు తింటున్నాను. వాటి గురించి పట్టించుకోవద్దు. సాయంత్రం మంచిగా చాయ్​ తాగుతూ.. ఆ తిట్ల మీద జోకులు వేసుకొని నవ్వుకోండి. మరుసటిరోజు ఉదయం కమలం వికసిస్తదని ముందుకు వెళ్లండి. అధికారమనేది ప్రజలకు సేవ చేయడానికి ఓ మార్గం. తెలంగాణ ప్రజలు వీళ్ల(టీఆర్​ఎస్​)కు అధికారం ఇస్తే.. వీళ్ల ధ్యాసంతా మోడీని, బీజేపీని తిట్టడంపైనే ఉంది. రోజూ నేను రెండు మూడు కిలోల తిట్లు తింటాను కాబట్టే అలసట లేకుండా ప్రజలకు సేవ చేసుకోగలుగుతున్నాను. తిట్లన్నీ నా కడుపులో ప్రాసెస్​ అయి.. న్యూట్రిషన్​గా కన్వర్ట్​ అయ్యేలా దేవుడు వరమిచ్చాడు