గోవధ పై స్పందించిన మంత్రి హరీష్ రావు

గోవధ పై స్పందించిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట: నాగదేవత గుడి బైపాస్ రోడ్డు ప్రాంతంలో గోవధ సంఘటనపై మంత్రి హరీష్ రావు సీరియస్ గా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. చనిపోగా మిగిలిన గోవులను సంరక్షణ కోసం గోశాలకి తరలించాలని అధికారులకు సూచించారు. గోవధ సంఘటన పై మంత్రి హరీష్ రావు విచారం  వ్యక్తం చేశారు. గోవధ హేయమైన చర్య అని, తాను  తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటన పై వెంటనే విచారణ చేపట్టి ఇందుకు పాల్పడిన నిందితులను గుర్తించి కఠినంగా  శిక్షించాలని, గోవులను తరలించిన వాహనాలను సీజ్ చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకానున్న హృతిక్

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

28న ‘ప్రైవేట్‌’తో ఇస్రో తొలి ప్రయోగం

పోలీసుల మెరుపు వేగం.. 3 గంటల్లో కిడ్నాపర్ల అరెస్టు