పొరపాటున రూ. 495 కోట్లు ఏపీకి కేటాయించిన్రు: హరీశ్

పొరపాటున రూ. 495 కోట్లు ఏపీకి కేటాయించిన్రు: హరీశ్

తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను తక్షణమే  విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కు లేఖ రాశారు.  2014,15లో తెలంగాణకు రావాల్సిన సీఎస్ఎస్ నిధులను  పొరపాటున ఏపీకి విడుదల చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు.  రాష్ట్రానికి తక్షణమే రూ.495 కోట్లు సర్దుబాటు చేయాలని లేఖలో కోరారు.   దీంతో పాటు పెండింగ్ లో ఉన్న ఐజీఎస్టీ నిధులను సైతం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.