పూర్తి పార‌ద‌ర్శ‌కంగా భూముల వేలం 

పూర్తి పార‌ద‌ర్శ‌కంగా భూముల వేలం 

ప్రభుత్వ భూముల అమ్మకంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో ఎప్పుడూ ప్రభుత్వ భూములు అమ్మనట్టు, తామే మొదటిసారి భూములు అమ్ముతున్నట్లు విడ్డూరంగా మాట్లాడున్నారని మండిపడ్డారు హరీష్. కాంగ్రెస్ నేత బట్టి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 88వేల  5వందల ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మినట్లు లెక్కలు చెప్పినట్లు లెక్కలు చెప్పారు హరీష్. పూర్తి పారదర్శకంగా భూముల వేలం జరుగుతుందన్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు సాగు నీరందించే సంగమేశ్వర ఇరిగేషన్ సర్వే పనులను ప్రారంభించారు హరీష్.