యాదాద్రి గోపురానికి బంగారు పూత

యాదాద్రి గోపురానికి బంగారు పూత

ప్రపోజల్ ఉందన్న మంత్రి ఇంద్రకరణ్

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి ఆలయ గోపురానికి దాతలు ఇచ్చే బంగారంతో పూత వేయించే ప్రపోజల్​ ఉందని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి తెలిపారు. గురువారం దేవాలయాల అభివృద్ధిపై ప్రశ్న సందర్భంగా శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్​ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమల మాదిరి దాతల నుంచి బంగారం సేకరించి ఆలయ ద్వారాలు, గోపురానికి బంగారు పూత వేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి ఆ ప్రపోజల్​ తమ దృష్టిలో ఉందని, ఇప్పటికే గోపురానికి బంగారు పూతపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కోర్టు భవనాలపై ప్రశ్న సందర్భంగా మట్లాడిన ఇంద్రకరణ్​ రెడ్డి..  72 న్యాయస్థానాలు అద్దె భవనాలలో పనిచేస్తున్నాయని, త్వరలోనే వాటన్నింటికీ కొత్త బిల్డింగులు కడుతామన్నారు.