
రాజన్న సిరిసిల్ల జిల్లా: కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వేములవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో బెడ్ల సంఖ్యను పెంచామన్నారు మంత్రి కేటీఆర్. శుక్రవారం ఆయన వేములవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 100 పడకల హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..కరోనా సెకండ్ వేను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో పలు హాస్పిటల్స్ లో బెడ్ల సంఖ్యను పెంచామన్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని..అయితే ఒకవేళ పెరిగే అవకాశం ఉన్నా ఈ హాస్పిటల్స్ ఉపయోగపడుతాయన్నారు.
కరోనా బాధితులకు ఆక్సీజన్, మందుల కొరత లేకుండా చూస్తున్నామన్న కేటీఆర్..బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కు సంబంధించి కూడా మెడిసిన్స్ అందుబాటులో ఉంచామన్నారు. డాక్టర్లు చెప్పిన సూచనల మేరకు ఫంగస్ లకు భయపడాల్సిన అవసరం లేదని.. కరోనా శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్ తోనే సాధ్యం అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ కోసం డిమాండ్ ఎక్కవగా ఉందని..కానీ కేంద్రం నుంచి ఎక్కువ సప్లై లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫస్ట్ డోస్..సెకండ్ డోస్ వేగంగా జరిగిందన్నారు.
ఈ ఏడాది చివరికల్లా అందరికీ వ్యాక్సిన్ వేయాలనుకుంటున్నామని..ఇందుకు కేంద్రం సపోర్ట్ ఉండాలన్నారు. సెకండ్ వే తగ్గుముఖం పట్టిందని హెల్త్ డిపార్ట్ మెంట్ చెబుతుందని..ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. లాక్ డౌన్ కఠినతరంలోనే కేసులు తగ్గుతున్నాయన్నారు. థర్డ్ వేలో చిన్నపిల్లకు ముప్పు ఉందని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో .. ముందుగానే చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐసొలేషన్ కు పెద్దగా స్పందన రావడంలేదని.. ఫస్ట్ వేలో కరోనా బాధితులు ఐసొలేషన్ లో ఉన్నారు కానీ..ఇప్పుడు హోం ఐసొలేషన్ లో ఉంటున్నారన్నారు.