హైదరాబాద్ ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి: కేటీఆర్

హైదరాబాద్ ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి: కేటీఆర్

జూబ్లీహిల్స్ నందినగర్ లో మంత్రి కేటీఆర్ ఆయన ఫ్యామిలీతో ఓటేశారు. ఒక తెలంగాణ పౌరుడిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నానని చెప్పారు. తను ఒక మంచి నాయకుడికి.. మంచి పార్టీకి ఓటేశానని వివరించారు. ఓటు మన హక్కు.. అందరూ ఓటేయాలని తెలిపారు. 

పల్లెల కంటే.. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గుతోందని.. కాబట్టి పట్టణాల్లో ఉన్న వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు తప్పకుండా ఓటు వేయాలన్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు.