నా ఆస్తి అంతా తీస్కోండి, అమ్ముకోండి : మంత్రి మల్లారెడ్డి

నా ఆస్తి అంతా తీస్కోండి, అమ్ముకోండి : మంత్రి మల్లారెడ్డి

ఐటీ దాడులు జరుగుతున్న తీరుపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన కొడుకును రాత్రంతా సీఆర్పీఎఫ్ వాళ్లతో కొట్టించినందుకే అతను హాస్పిటల్ పాలయ్యాడని ఆరోపించారు. విచారణలో భాగంగా తన కొడుపైకే దాడి చేశారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మంత్రినన్న కారణంతోనే తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. 

రాజేశ్వర్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి, జై కిషన్ తో తనకేం సంబంధమని మల్లారెడ్డి ప్రశ్నించారు. తన ఆస్తులు అమ్ముకోండి.. గుంజుకోండి... వేలం వేసుకోండి అంతేతప్ప ఇలా దౌర్జన్యం చేయడం మంచిది కాదని అన్నారు. తన ఇల్లు, ఆఫీసులు, కాలేజీల్లో సోదాలు చేసినా ఏమీ దొరకలేదని చెప్పారు. త్రిశూల్ రెడ్డి దగ్గర, ఊరిలో ఎవరి దగ్గర పైసలు దొరికినా తనవేనా అని మల్లారెడ్డి ప్రశ్నించారు. ఇంత దౌర్జన్యంగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటి దాకా చూడలేదన్న ఆయన.. కనీసం తన కొడుకును కూడా చూడనిస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ కన్వీనర్ కోటా విషయంలో వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు తాను సిద్ధమని మల్లారెడ్డి చెప్పారు.