బండి సంజయ్కు మల్లారెడ్డి సవాల్

బండి సంజయ్కు మల్లారెడ్డి సవాల్

రాష్ట్రాభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి జరిగితే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాష్ట్రంలో 12వేల 700 గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని వ్యాఖ్యానించారు. తాగు, సాగునీరు, హరితహారం, డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 
 
సమైక్య రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ రైతును రాజును చేశారని మంత్రి అన్నారు. ఇంజనీర్ అవతారం ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. రైతుకు పెట్టుబడి సాయంతో పాటు రైతుబీమా అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసమే కల్లాలను కట్టారని.. కానీ మోడీ డబ్బులు వాపస్ ఇవ్వమనం సిగ్గుచేటన్నారు. బ్యాంకులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని వదిలిపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.