డీజే టిల్లు పాటకు మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్..అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ..

డీజే టిల్లు పాటకు మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్..అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి  డ్యాన్సులతో దుమ్మురేపారు. సినిమా పాటలకు స్టెప్పులేస్తూ అధికారులు, సహచర ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజల్లో జోష్ నింపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పీర్జాది గూడాలో రాచకొండ పోలీస్, పీర్జాదిగూడా  మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రన్ నిర్వహించారు. ఈ రన్ కు ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, సిపి చౌహన్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి డీజే పాటలకు డ్యాన్సులతో అదరగొట్టారు. డీజే పాటలకు స్టెప్పులేశారు. 

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు..

తెలంగాణా రన్ ముగిసిన తర్వాత వేదికపై మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు మంత్రి మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ హైలెట్. బీట్ కు తగ్గట్లు ఆయన డ్యాన్స్ చేస్తుంటే విద్యార్థులు, ఇతర ప్రజలు జోష్ తో కాలు కదలిపారు. ఆ తర్వాత చిరంజీవి ఖైది నెం 150 సినిమాలోని అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటకు సైతం మంత్రి మల్లారెడ్డి స్టెప్పులేశారు. 

కేసీఆర్ ప్రధాని అవుతారు..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాబట్టి ఇలాంటి రన్ లు ఆరోగ్యానికి ఎంతో అవసరం అని చెప్పారు. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని... తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ప్రతీ ఒక్కరికి పథకాలు చేరాయని తెలిపారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ గెలవడం ఖాయమని..తెలంగానలో కేటీఆర్ ముఖ్యమంత్రి,   కేసీఆర్ దేశ ప్రధానమంత్రి అవడం ఖాయమని చెప్పారు.