కూర్చో అనగానే కూర్చోడానికి మేము పాలేర్లం కాదు : మంత్రి పొన్నం

కూర్చో అనగానే కూర్చోడానికి మేము పాలేర్లం కాదు : మంత్రి పొన్నం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.  ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి సభలో మాట్లాడుతుండగా  పొన్నంను కూర్చోవాలంటూ కౌశిక్ రెడ్డి రన్నింగ్ కామెంటరీ చేశారు.  దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తాము భయపెడితే  భయపడే రకం కాదని..  మీరు  కూర్చో అనగానే కూర్చోడానికి తాము పాలేర్లము కాదన్నారు. తనకు ఓట్లు వేయకపోతే భార్య పిల్లలతో కలిసి శవయాత్ర చూడాల్సి వస్తుందంటూ ఓటర్లను బెదిరించిన  వ్యక్తి తనను కూర్చోమని  బెదిరిస్తారా అని మంత్రి పొన్నం మండిపడ్డారు. 

కడియం శ్రీహరి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.  కడియం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కుర్చీవేసుకోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేసీఆర్  మాటలు ఏమయ్యాయని నిలదీశారు.  గౌరవెల్లి కింద కాల్వలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు.

Also Read: పార్లమెంట్ ఎన్నికల్లోపు.. 2 గ్యారంటీలు అమలు