చంద్రబాబు..హైదరాబాద్ నుంచి తరిమి కొడతరు: రోజా

చంద్రబాబు..హైదరాబాద్ నుంచి తరిమి కొడతరు: రోజా

దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి కేరాఫ్ చంద్రబాబు, టీడీపీ నేతలే అని ఏపీ మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి ఒక్క సీటు కూడా రాదని వ్యాఖ్యానించారు. గన్నవరంలో టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమి కొడతారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం14  మంది వెనుకబడి కులాలకు చెందిన వారికి ఎమ్మెల్సీ పదవులిచ్చి గౌరవించిందని వెల్లడించారు.

పనికిమాలిన వెధవలు, పైసాకు పనికిరాని వ్యక్తులతో సీఎం జగన్ ను తిట్టిస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. ప్రజల సంక్షేమానికే సీఎం జగన్ నిత్యం పాటుపడుతున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు నోరులేస్తే చేతులతో సమాధానం చెబుతామని ఆమె అన్నారు. ఈజ్ఆఫ్ డూయింగ్, జీఎస్టీపీలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. పోలీసు వ్యవస్థను వాడుకోవడం తెలిసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే.. మా ప్రభుత్వంలో పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని రోజా పేర్కొన్నారు.