మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలి: సీతక్క

మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలి: సీతక్క

మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలన్నారు మంత్రి సీతక్క. జాతీయ ఉత్సవానికి వాల్సిన అర్హతలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఉన్నాయని తెలిపారు. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసున్నామంటున్నారు. 

ములుగు జిల్లా మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫిబ్రవరి 19న  వనదేవతలను దర్శించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జాతరకు నెల రోజుల ముందే 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారన్నారు. 

అంతకుముందు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పగిడిద్దరాజు పూజారులకు కొత్త బట్టలు, డోలీలు అందజేశారు సీతక్క. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈనెల 20వ తేదీన పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు మేడారం బయలుదేరుతాడని, మళ్ళీ జాతర సమయం లోపు పూనుగొండ్లలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సీతక్క.