పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం : మంత్రి సీతక్క

పదేళ్ల  తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం : మంత్రి సీతక్క

పదేళ్ల  తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కనిపిస్తుందన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో  నిరసన చేస్తే సస్పెండ్ చేశావారు కానీ మేం అలా చేయడం లేదన్నారు. అధికారం పోయాక  బీఆర్ఎస్ కు  నిరుద్యోగులు గుర్తుకు వచ్చి ఆందోళన చేయడం హస్యస్పదంగా ఉందన్నారు.   తెలంగాణ ఏర్పడిందే  నియామకాల మీద .. అలాంటి బీఆర్ఎస్  అధికారంలో ఉన్నప్పుడు  నియామకాలమీద స్పందించలేదన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాల తో పాటు , జాబ్ నోటిఫికేషన్ లు ఇచ్చామని చెప్పారు.

పదేళ్లుగా ఉద్యోగాల భర్తీని పట్టించుకోని బీఆర్ఎస్, జాబ్ క్యాలెండర్ కోసం డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సీతక్క.  అసెంబ్లీ పోడియం దగ్గరకి  వెళ్లినా,  ప్లకార్డులు ప్రదర్శించినా గత ప్రభుత్వం సస్పెండ్ చేసేది .. కానీ తాము అలా చేయడం లేదు అని అన్నారు.  గతంలో నిరసనలను అనగదొక్కిన బీఆర్ఎస్  ఇప్పుడు నిరసనకు దిగడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  బీఆర్ఎస్  నిరసనలతో రాష్ట్రంలో  ఎంత ప్రజా స్వామ్యం ఉందో అర్థం అవుతుందన్నారు. ఉద్యోగాల భర్తీలో  ఉన్న చిక్కు ముడులను విప్పి నియామకాలు చేపట్టామని చెప్పారు.  త్వరలోనే  జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.