డెడ్బాడీస్కు బీజేపీ ట్యాక్స్ వసూల్ : మంత్రి సీతక్క

డెడ్బాడీస్కు బీజేపీ ట్యాక్స్  వసూల్ : మంత్రి సీతక్క

 ఆదిలాబాద్: డెడ్​బాడీస్​కు బీజేపీ ప్రభుత్వం టాక్స్ వసూల్ చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్ ను ఆదరించాలని సూచించారు. ఇవాళ ఆదిలాబాద్ లో  కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్, కోఆర్డినేటర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. దేహం ముక్కలైనా దేశం కోసం ఇందిరా గాంధీ కుటుంబం పని చేసిందన్నారు. బీజేపీ మతాల గురించి తప్ప పనుల గురించి చెప్పదని మండిపడ్డారు. 

మోడీ వచ్చి ఆదిలాబాద్ కు వచ్చి సీసీఐ  గురించే మాట్లాడలేదని అన్నారు. గ్యారంటిలకే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.  బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని మన భవిష్యత్, విద్య, బట్టల మీద 12 శాతం టాక్స్​ వేసిందన్నారు. పేదలను మరింత పేదలను చేసిందని మండిపడ్డారు.  బీజేపీకి జంతువుల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ ను ఓట్లతో పక్కన పెట్టిన వారు ఇప్పుడు బీజేపీని పక్కన పెట్టాలని సూచించారు.