
హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళల కోసం కేసీఆర్ గొప్ప గొప్ప పథకాలు తెచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద 113 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ల క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పేదింటి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా లక్షా 116 రూపాయల ఆర్ధిక సాయం చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి KCR నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసం వద్ద 113 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. pic.twitter.com/iHI2icsqtH
— Talasani Srinivas Yadav (@YadavTalasani) May 8, 2022
మరిన్ని వార్తల కోసం...