పామాయిల్ సాగు విస్తరణకు రైతులు ఆసక్తి

పామాయిల్ సాగు విస్తరణకు రైతులు ఆసక్తి

రాష్ట్రంలో పామాయిల్ సాగు  విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట నియోజవర్గం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో మంత్రి పర్యటించారు. నిర్మల్ జిల్లాలో పామాయిల్ సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారన్నారు ఇంద్రకరణ్. సాగు పద్ధతులు తెలుసుకునేందుకు రైతులతో కలిసి పామాయిల్ తోటలను సందర్శించారు.  అప్పారావు పేట గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. నిర్మల్ జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో పామాయిల్ పంట సాగుకు దరఖాస్తులు అందాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

కోల్‌కతాపై 75 రన్స్‌ తేడాతో లక్నో గెలుపు

కేటాయించిన నీళ్లే వాడుకోలేని దుస్థితిలో తెలంగాణ