బీజేపీ రాష్ట్రాల్లో ఈ స్కీమ్‌లు చూపెట్టి పాదయాత్ర చెయ్

బీజేపీ రాష్ట్రాల్లో ఈ స్కీమ్‌లు చూపెట్టి పాదయాత్ర చెయ్

కామారెడ్డి: గాంధారి మండల కేంద్రంలో రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై విమర్శలకు దిగారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ‘బండి సంజయ్ పాద్రయాత చేస్తాడట. రాష్ట్రంలో రెండు వేల పెన్షన్ ఇస్తున్నారని పాదయాత్ర చేస్తావా? రైతుబంధు ఇస్తున్నారని, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారని పాదయాత్ర చేస్తావా? లేదా కేసీఆర్ కిట్‌లు ఇస్తున్నారని పాదయాత్ర చేస్తావా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న స్కీంలను ఒక్కటైనా చూపించి పాదయాత్ర చెయ్’ అని ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు.