ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా

ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా

సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ ను ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని బండి సంజయ్ ను హెచ్చరించారు.  తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కంటే  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రూపాయి జీతం ఎక్కువ ఇచ్చినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంటే  బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తానన్నారు.  పివీ కుమార్తె  వాణీదేవి పాలమూరు గడ్డ కోడల్ని గెలిపించుకోవాల్సిన బాద్యత తమపై ఉందన్నారు.