గ్రూప్ –1 పరీక్ష ఉచిత శిక్షణకు..మైనార్టీ అభ్యర్థులు అప్లై చేసుకోండి

గ్రూప్ –1 పరీక్ష ఉచిత శిక్షణకు..మైనార్టీ అభ్యర్థులు అప్లై చేసుకోండి
  •     వికారాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి 

 వికారాబాద్, వెలుగు  : రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్-–1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ కొరకు ఉచిత శిక్షణను అందిస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి డి .సుధారాణి సూచించారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన మైనార్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవాలని తెలిపారు. ఉచిత శిక్షణ 45 రోజులు ఉంటుందని, ముందుగా వచ్చే దరఖాస్తుల్లో 100 మందికే  కోచింగ్ ఇస్తామని స్పష్టంచేశారు.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు  తమ దరఖాస్తులను ఈనెల 25 లోగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆఫీస్ వికారాబాద్ లో  అందజేయాలని సూచించారు. దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు, ఎస్ఎస్ సీ, ఇంటర్ , డిగ్రీ మార్కుల మెమో, గ్రూప్-1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు దరఖాస్తు చేసుకున్న రిజిస్ట్రేషన్ కాఫీ, పాస్ పోర్ట్ సైజు ఫొటోలు-2 జతపరిచి, హార్డ్ కాపీలను మైనార్టీ సంక్షేమ శాఖ ఆఫీసులో అందజేయాలని తెలిపారు. అర్హులైన మైనార్టీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 9912144364,     9440685713 లలో సంప్రదించాలని చెప్పారు.