కుత్బుల్లాపూర్లో ముగ్గురు పిల్లలతో తల్లి అదృశ్యం

కుత్బుల్లాపూర్లో ముగ్గురు పిల్లలతో తల్లి అదృశ్యం

దుండిగల్ పీఎస్ పరిధిలోని కుత్బుల్లాపూర్ లో ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం కలకలం రేపుతోంది. మంగళవారం( జనవరి 2) న ఉదయం నుంచి తన ముగ్గురు పిల్లలతో వివాహిత కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. పని కి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్యా పిల్లలు కనిపించకపోవడంతో దుండిగల్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. వివరాల్లోకి వెళితే.. 

కుత్బుల్లాపూర్ పరిధిలోని మల్లంపేట్  ఇందిరమ్మ కాలనీలో గత 11 ఏళ్లుగా ముగ్గురు పిల్లలతో నివాసముంటున్నారు ఇంతియాజ్ మహ్మద్, అతని భార్య రుసిబినా బానో(30). మంగళవారం( జనవరి 2) న ఉదయం పనులకోసం బయటికి వెళ్లిన ఇంతియాజ్ మహ్మద్ సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్యా పిల్లలు కనిపించకుండా పోయారు. ఎంత వెదికినా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఇంతియాజ్,, దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.