మిస్టర్ మిస్టర్స్ మహి మూవీ మోషన్ పోస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

మిస్టర్ మిస్టర్స్ మహి మూవీ మోషన్ పోస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. వరుస సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘మిస్టర్ మిస్టర్స్ మహి’ విడుదలకు సిద్ధమైంది. రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ రావ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జాన్వీ జంటగా శరణ్ శర్మ రూపొందించిన ఈ చిత్రం  మే 31న రిలీజ్ అవుతోందని ప్రకటించారు. ఈ సందర్భంగా మోషన్ పోస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో జాన్వీ, రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ క్రికెట్ జెర్సీలో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. ఈ వీడియోలో ‘అసంపూర్ణంగా ఉన్న  పరిపూర్ణ భాగస్వామ్యం’ అనే క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

క్రికెట్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూపొందిన ఈ చిత్రంలో మహేంద్ర పాత్రలో రాజ్ కుమార్, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు.  జియో స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు జాన్వీ కపూర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై ఆమె రియాక్ట్ అయ్యింది. ఆమె పెళ్లి తిరుపతిలో జరగనుందని, ఓ నెటిజన్ పోస్ట్ చేయగా, దానికి ఆమె ‘కుచ్ బీ’ అంటూ రిప్లై ఇచ్చింది. ఎన్నిసార్లు ఈ రూమర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెక్ పెట్టినా ఎవరో ఒకరు పెళ్లి గురించి పోస్ట్ చేయడంతో ఆమె మండిపడింది. ఇక జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ‘దేవర’ చిత్రంతో పాటు  బుచ్చిబాబు రూపొందిస్తున్న చిత్రంలో  రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా నటిస్తోంది.