సౌతాఫ్రికా మ్యాచ్‌లో మిథాలీ రాజ్ అరుదైన ఘనత

సౌతాఫ్రికా మ్యాచ్‌లో మిథాలీ రాజ్ అరుదైన ఘనత
  • పదివేల క్లబ్‌లోకి ఎంటరైన మొదటి భారత మహిళా క్రికెటర్

భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పది వేల పరుగులు సాధించిన మొదటి భారత మహిళగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన రెండో మహిళా క్రికెటర్‌గా కూడా తన పేరును నమోదుచేసుకుంది. లఖ్‌నవ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో మిథాలీ ఈ ఘనత సాధించింది. మిథాలీ 311 మ్యాచులు ఆడి ఈ రికార్డ్ సాధించింది. ఈ రికార్డ్ మొదటగా ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరు మీద నమోదైంది. ఆమె 309 మ్యాచులు ఆడి 10,273 పరుగులు సాధించింది.