- ఎండీఎంఏ అమ్ముతున్న పెడ్లర్ అరెస్ట్
- 9 గ్రాములున్న 14 ట్యాబ్లెట్స్స్వాధీనం
మియాపూర్, వెలుగు : మియాపూర్మెట్రో స్టేషన్ సమీపంలో ఎండీఎంఏ (ఎక్టసీ ట్యాబ్లెట్స్)అమ్ముతున్న ఓ డ్రగ్ పెడ్లర్ను మియాపూర్ పోలీసులు, ఈగల్టీం అదుపులోకి తీసుకుంది. వారి నుంచి 9 గ్రాముల బరువున్న 14 ఎక్టసీ ట్యాబ్లెట్స్స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పోలా సురేశ్ గోపి 2024లో గోవాలో రెంటల్ ప్రాపర్టీ బిజినెస్స్టార్ట్చేశాడు. డ్రగ్స్ సరఫరా చేసే బాబా పరిచయం కావడంతో దందా మొదలుపెట్టాడు. ముంబయికి చెందిన డ్రగ్స్పెడ్లర్డానిష్ ఆలమ్ అన్సారీ కూడా పరిచయం కావడంతో అక్కడి నుంచి కూడా డ్రగ్స్తెస్తున్నాడు.
16న ముంబయికి వెళ్లిన గోపి..డానిష్ ఆలమ్ అన్సారీ నుంచి రూ. 22వేలకు 29 ఎక్టసీ ట్యాబ్లెట్స్కొన్నాడు. అక్కడే 15 ట్యాబ్లెట్స్అమ్మి 14 ట్యాబ్లెట్స్ను ప్రైవేట్ ట్రావెల్స్లో హైదరాబాద్కు తీసుకువచ్చాడు. మియాపూర్ మెట్రో స్టేషన్వద్ద వీటిని అమ్మే ప్రయత్నంలో ఉండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల ద్వారా డ్రగ్స్ సేకరణ, రవాణా, సరఫరా పంపిణీతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఇతర నిందితులైన గోవాకు చెందిన బాబా, ముంబయికి చెందిన డానిష్ ఆలమ్ అన్సారీ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
