మిజోరాం గవర్నర్ గా జగదీశ్ ముఖి ప్రమాణం

మిజోరాం గవర్నర్ గా జగదీశ్ ముఖి ప్రమాణం

వెలుగు: మిజోరాం గవర్నర్ గా అస్సాం గవర్నర్ జగదీశ్​ముఖి శనివారం అదనపు బాధ్యతలు చేపట్టారు. గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్​ నెల్సన్ సైలో రాజ్ భవన్ లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిం చారు. గవర్నర్ కుమ్మనం రాజ శేఖరన్ గురువారం తన పదవికి రాజీనామా చేయడంతో ముఖికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మిజోరం బాధ్యతలు అప్పగించారు. మంగళవారం జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన ప్రసంగించనున్నారు.