కరోనాతో సస్తుంటే.. నీకు ఇల్లు కావాల్నా

కరోనాతో సస్తుంటే.. నీకు ఇల్లు కావాల్నా
  •                 డబుల్​ బెడ్​రూం అడిగిన మహిళపై ఎమ్మెల్యే ఆగ్రహం
  •                 ఎన్నికలప్పుడు ఒకమాటా.. ఇప్పుడొకమాటా ..

 

డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరిన మహిళ పై నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లిలో ఎమ్మెల్యే సోమవారం బతుకమ్మచీరలను  పంపిణీ చేశారు. తనకు ఇల్లు లేదని, డబుల్​ బెడ్​రూం ఇళ్లు  మంజూరు చేయాలని లక్ష్మిఅనే మహిళ  ఎమ్మెల్యేను కోరింది. కరోనాతో అందరూ చనిపోతుంటే నీకు ఇల్లు కావాల్నా అంటూ ఆమె మీద ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు.  ఇండ్లు సాంక్షన్​ చేస్తాం, ఓట్టేయండంటూ  ఎన్నికలప్పుడు  చెప్తరు.. ఇప్పుడు అడిగితే ఇట్ల మాట్లడతరా అని లక్ష్మి ఆసహనం వ్యక్తం చేసింది. మరికొందరు మహిళలు తాగునీటి సమస్య గురించి ప్రశ్నించారు. చీరలు ఇచ్చుడు కాదు సారూ తాగడానికి నీళ్లియ్యమని కోరారు. ఎంపీపీ కల్లూరి హరికృష్ణ  మహిళలకు  నచ్చజెప్పారు.  వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జడ్పీ కోఆప్షన్ మెంబర్​ మన్సూర్ అలీ, సొసైటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎంపీడీవో నవీన్ కుమార్, సర్పంచ్ పార్వతి   పాల్గొన్నారు.