జర్నలిస్టు పాండు గౌడ్ను పరామర్శించిన ఎమ్మెల్యే

జర్నలిస్టు పాండు గౌడ్ను పరామర్శించిన ఎమ్మెల్యే

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు రాయగిరి పాండు గౌడ్ ను ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పరామర్శించారు. ఇటీవల పాండు గౌడ్ సోదరి స్వర్ణలత అనారోగ్యంతో మృతి చెందింది. 

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. పాండు గౌడ్ ఇంటికి వెళ్లి స్వర్ణలత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాండు గౌడ్, కుటుంబ సభ్యులను ఓదార్చి  ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మల్లేశ్​యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ గౌడ్ ఉన్నారు.