ఎవరికీ భయపడేది లేదు.. నా అనుచరులకే ఇండ్ల స్థలాలిస్తా..

ఎవరికీ భయపడేది లేదు.. నా అనుచరులకే ఇండ్ల స్థలాలిస్తా..

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గరీబ్ నగర్‌లో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గరీబ్ నగర్ ప్రభుత్వ భూమిపై విచారణ జరిపి అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనర్హులకు ఇండ్ల పట్టాల అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎవరికీ భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. తన అనుచరులకు, మద్దతుదారులకే ఇండ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే ఖరాకండిగా చెప్పారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి గతంలో కూడా పలు వివాదాలలో చిక్కుకున్నారు. అయోధ్య రామాలయం కోసం ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు చందాలు వసూలు చేయడంపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలను తక్కువ కులాల వాళ్లు రిజర్వేషన్ పేరుతో తన్నుకుపోతున్నారని నోరు జారారు.