రోడ్లపై చిల్లర అడుక్కున్న వాళ్లు కోటీశ్వరులయ్యారు

రోడ్లపై చిల్లర అడుక్కున్న వాళ్లు కోటీశ్వరులయ్యారు

సంగారెడ్డి : కేసీఆర్ కుటుంబంలో ఒక్కకరు ఒక ఆర్టిస్ట్ గా తయారయ్యారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాలు బాగుపడుతాయని అనుకున్నారు కానీ.. రాష్ట్ర ప్రజల జీవితాలు ఏమీ మరలేదన్నారు. మంత్రి హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఇప్పుడు ఎంపీ సంతోష్ ఒక్కొక్కరు ఒక ఆర్టిస్ట్ లుగా మారారన్నారు.  సంతోష్ గ్రీనరీ అని ఒక కొత్త సినిమా చూపిస్తున్నాడని.. ఈ భూమి పుట్టిన్నపటి నుండి వీళ్లే చెట్లు నటిన్నట్లు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఎంపీ సంతోష్ హీరో ప్రభాస్ ని తీసుకొచ్చి చెట్లు పెట్టిస్తాడు.. బొంబాయి నుండి హీరోయిన్ లను తెచ్చి మొక్కలు పెట్టిస్తాడన్నారు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు పోరాటం చేస్తుంటే.. ఇక్కడికి వచ్చి సమస్యలు తెలుసుకొని చెట్లు పెట్టించొచ్చు కదా..! అన్నారు. ఎక్కడ సంతోష్…ఎక్కడ తెలంగాణ …ఎక్కడ ఆర్టిస్ట్ లు అన్నారు.  సంతోష్.. కేసీఆర్ ఆస్తులకు,రాజకీయంగా  బినామీ అన్నారు. రోడ్ల పొంటి రూపాయి రూపాయి అడ్డుకున్న వాళ్ళు ఇయ్యాల కోటీశ్వర్లు అయ్యారని తెలిపారు. కష్టపడే జీవేమో అడుక్కుని తినే పరిస్థితి వచ్చిందన్నారు జగ్గారెడ్డి.