కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి :  ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి 

కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి :  ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి 

హాలియా, వెలుగు : కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి చెప్పారు. శనివారం హాలియా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అనుముల మండలంలోని వివిధ గ్రామాలకు తెలంగాణ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా మంజూరైన గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు.

అనంతరం నూతనంగా బాధ్యలు స్వీకరించిన హాలియా పెద్దవూర, సాగర్​ ఎస్ఐలు బండి సాయిప్రశాంత్ కుమార్​, వై.ప్రసాద్, ముత్తయ్య ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, కార్పెంటర్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు యల్లయ్యచారి, గౌరద్యక్షుడు సనగంటి సాగరాచారి, కోశాధికారి నాగార్జున బ్రహ్మచారి, గౌరవ సలహాదారుడు లక్ష్మణాచారి, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.