ఆర్య వైశ్యులు సామాజిక సేవలో ముందుండాలి

ఆర్య వైశ్యులు సామాజిక సేవలో ముందుండాలి

కోదాడ, వెలుగు: ఆర్య వైశ్యులు సామాజిక సేవలో ముందుండాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు.  ఆదివారం కోదాడ పట్టణంలో జరిగిన ఆర్య వైశ్య సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్య వైశ్యులు సమాజంలో అన్ని వర్గాల వారితో స్నేహ సంబంధాలు కలిగి ఉండి సేవాభావాన్ని కలిగి ఉన్నారన్నారు. వారు తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కోరారు.  

గత 30 సంవత్సరాలుగా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్ తో ఆర్య వైశ్యులకు మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయన్నారు. కోదాడ లో ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. 

స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం.....

అంతకు ముందు ఆమె కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కత్రం శ్రీకాంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఆన్ వీల్స్ అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ అంబులెన్స్ తో నియోజకవర్గంలో పేదలకు ఉచిత వైద్యం తో పాటు వారికి కావాల్సిన మందులు ఇవ్వడం అభినందనీయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు తమ సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, డాక్టర్ జాస్తి సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వర రావు, నాయకులు అమరవాది లక్ష్మీ నారాయణ, పైడిమర్రి సత్యబాబు,  గరినే ఉమా మహేశ్వరి, శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.